నేను శైలజ దర్శకుడితో నాని

Hero Nani

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏతో పాటు మేర్లాపాక గాంధీ తెరకెక్కిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

నేను శైలజ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ ప్రస్తుతం రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top