ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలకు ఈ నెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి గురువారం తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18, రూ.500 అపరాధ రుసుముతో 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీజీ ఐసెట్–2025 అర్హత గల విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడాలని సూచించారు.


