ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న | OU MBA and MCA Entrance Exams on February 22nd | Sakshi
Sakshi News home page

ఓయూ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు పరీక్ష 22న

Feb 6 2026 1:54 AM | Updated on Feb 6 2026 1:54 AM

OU MBA and MCA Entrance Exams on February 22nd

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలకు ఈ నెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పాండురంగా రెడ్డి గురువారం తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18, రూ.500 అపరాధ రుసుముతో 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీజీ ఐసెట్‌–2025 అర్హత గల విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement