సల్మాన్‌తో మైత్రి

Mythri Movie Makers to produce Salman Khan starrer - Sakshi

‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి చిత్రాలతో ఆరంభంలోనే వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు ఈ సంస్థ అధినేతలు వై. రవిశంకర్, నవీన్‌ యర్నేని. ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో తొలి అడుగు వేయనుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top