క్రిష్‌ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్‌ బాబు

Mohan Babu Comments On Ntr Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌ సన్నిహితులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేడుకలో ప్రసంగించిన మోహన్‌ బాబు చివర్లో ‘క్రిష్‌.. యు డిడ్‌ ఏ వండర్‌ఫుల్‌ జాబ్‌.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ‍్లను కూడా మంచి క్యారెక్టర్స్‌ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో  నాకు తెలియదు’ అంటూ ముగించారు.

బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రణీత, శాలినీ పాండే, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌ అలనాటి అందాల భామలుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్‌, సుమంత్‌, కైకాల సత్యనారాయణ, ప్రకాష్ కోవెలమూడి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top