న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైఎస్ఆర్ సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ మూడు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, పార్టీ మారిన సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మూడు నెలల్లో సస్పెండ్ చేయాలని మేకపాటి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ప్రజాస్వామ్యానికి మచ్చని, చట్టాన్ని సవరించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణకు సంబంధించి రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు పెడతారని మేకపాటి తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు విశాఖ-చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విన్నవించారు. ఎంపీ లాడ్స్ నిధులను పెంచాలని మేకపాటి కోరారు.
మూడు నెలల్లో సస్పెండ్ చేయాలి
Published Sun, Jul 17 2016 3:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement