ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఇదే చిత్రంతో కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్– క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను హీరో రానా బుధవారం విడుదల చేశాడు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శ్రీసింహా రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. కామెడీతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.
రితేష్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను జూనియర్ ఎన్టీఆర్, టీజర్ను రామ్చరణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.