ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు | malli Malli Idi Rani Roju Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు

Dec 8 2014 10:54 PM | Updated on Sep 2 2017 5:50 PM

ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు

ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు

40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.

 ‘‘40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’.
 
 ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రమేశ్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రిప్ట్. సాయిమాధవ్ బుర్రా అద్భు తంగా సంభాషణలు రాశాడు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌ల ‘గోపాల గోపాల’ చిత్రానికి కూడా ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. పంపిణీదారులందరూ సహకరిస్తే... ఈ సినిమాను కూడా ‘గోపాల గోపాల’తోనే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తా. ఇది చక్కని ప్రేమకథ కాబట్టి, దీనికి ఏ సినిమా పోటీ కాదు’’ అని తెలిపారు.
 
 మనసుల్ని మెలిపెట్టే ప్రేమకావ్యంగా క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని మలిచారని శర్వానంద్ అన్నారు. ఈ సినిమాకు పెట్టినంత ఎఫర్ట్ ఇంతవరకూ తాను ఏ సినిమాకూ పెట్టలేదని నిత్యామీనన్ తెలిపారు. తెలుగు భాషంటే తనకు ఇష్టమనీ, క్రాంతిమాధవ్, నిత్యామీనన్ వల్లనే తెలుగు సినిమా చేసే అవకాశం తనకు లభించిందనీ, సంగీత దర్శకుడు గోపీ సుందర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement