ప్రయాణం  పూర్తి  కావచ్చింది | Mahesh babu maharshi shooting almost completed | Sakshi
Sakshi News home page

ప్రయాణం  పూర్తి  కావచ్చింది

Apr 1 2019 12:00 AM | Updated on Apr 7 2019 12:28 PM

Mahesh babu maharshi shooting almost completed - Sakshi

రిషి ప్రయాణం చివరి స్టాప్‌కు వచ్చేసింది. ఈ జర్నీలో ఏం కనుక్కున్నాడో, తెలుసుకున్నాడో మనందరికీ మే9న తెరపై చూపించనున్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. రిషి పాత్రలో మహేశ్‌ కనిపిస్తారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు.

పూజా హెగ్డే కథానాయిక. ‘మహర్షి’ టాకీ పార్ట్‌ చివరిదశకు వచ్చేసిందని సమాచారం. రెండు పాటలు మినహా నేటితో చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన రెండు పాటల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో, రెండో పాటను దుబాయ్‌లో షూట్‌ చేస్తారని సమాచారం. ‘అల్లరి’ నరేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కెమెరా: కె.యు.మోహనన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement