సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

KTR Comments On Saaho And Evaru - Sakshi

బాహుబలి తరువాత ప్రభాస్‌ నటించిన సాహో.. చిత్రం గతవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. డివైడ్‌ టాక్‌ వచ్చినా... వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 300కోట్లు కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వీక్షించిన కేటీఆర్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

సాహో టెక్నికల్‌గా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడు. ఈ సినిమాతో పాటు ‘ఎవరు’ ను వీక్షించినట్టు తెలిపాడు. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా బ్రిలియెంట్‌గా తెరకెక్కించారంటూ.. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారని ట్వీట్‌ చేశాడు. ఎవరు చిత్రం వసూళ్ల పరంగా దుమ్ములేపగా.. ప్రస్తుతం సాహో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top