కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట

కంటతడి పెట్టిస్తున్న చిరంజీవి పాట


మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌150' చిత్రంలోని మరో పాటను యూట్యూబ్‌ లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాల నేపథ్యంలో ఈ పాట వస్తుంది. అన్నదాతల ఆక్రందనలను ఆర్థ్రంగా పలికించిన ఈ పాట అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఈ పాటను తమను ఎంతోగానో కదిలించిందని అభిమానులు పేర్కొన్నారు.



నీరు.. నీరు..

రైతు కంట నీరు

చూడనైన చూడరెవ్వరూ

గుండెలన్ని బీడు

ఆశలన్ని మోడు
’  అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్‌ మహదేవన్‌ ఆలపించగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు కూడా  అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'ఖైదీ నెం.150' సినిమాను విడుదల చేయనున్నారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top