మహానటి తర్వాత...

Keerthy Suresh to do a lady oriented film in Telugu - Sakshi

‘మహానటి’ తర్వాత స్ట్రయిట్‌ తెలుగు సినిమాలేవీ సైన్‌ చేయలేదు కీర్తీ సురేశ్‌. తాజాగా కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెల మూడో వారం నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. ఇందులో కీర్తీ సురేశ్‌ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. ఆమెతో పాటు మరో మూడు ముఖ్యమైన పాత్రలు  ఉంటా యట.

‘మహా నటి’కి కెమెరామేన్‌గా వర్క్‌ చేసిన డ్యానీ ఈ సినిమాకి కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తీ అంగీకరించిన సినిమా ఇదే కావడం, ఆ సినిమా తర్వాత డ్యానీ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని మహేశ్‌ యస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top