ఏప్రిల్‌ 7, 8న కేసీసీ క్రికెట్‌ టోర్నీ

Kannada Chalanachitra Cup Cricket Tournament - Sakshi

కేపీఎల్, సీసీఎల్‌ తరహాలో సాండల్‌వుడ్‌ హీరోలతో కొత్తగా కేసీసీ టోర్నీ నిర్వహించటానికి రంగం సిద్దమైంది. కర్ణాటక చలనచిత్ర కప్‌ పేరుతో నిర్వహించే ఈ పోటీలకు జట్టును ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో ఆరు జట్లను ఎంపిక చేశారు. మాజీ క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే జట్టు ఎంపికకు సంబంధించి నియమ, నిబంధనలను వివరించారు. 

ఈ పోటీలు ఏప్రిల్‌ 7, 8 రెండు రోజుల పాటు 10 ఓవర్లతో ఆదిత్య గోబ్లల్‌ మైదానంలో జరుగునుంది. ఇందులో పాత్రికేయులు, సినిమా డైరక్టర్లు, నిర్మాతలు, నటులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్‌కుమార్, పునీత్‌ రాజ్‌కుమార్, సుధీప్‌, రవిచంద్రన్, వినయ్‌కుమార్, అశోక్‌ఖేణిలు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top