కొత్త దర్శకుడితో గోపిచంద్‌..!

Gopichand Next Movie With Debutant Director - Sakshi

మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇటీవల గోపిచంద్‌ నుంచి యావరేజ్‌ స్థాయి సినిమా కూడా రాలేదు. దీంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో. తన 25 సినిమాగా పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిచంద్ తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నాడు.

అనిల్‌ సుకంర నిర్మాణలో తిరు సుబ్రహ్మాణ్యాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు గోపిచంద్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top