గోపిచంద్‌ ‘పంతం’ ఫస్ట్‌ లుక్‌

Gopi Chand Pantham First Look - Sakshi

కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పంతం. గోపిచంద్‌ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కె. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ, జయప్రకాష్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్‌ సాధించి తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపిచంద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top