ధనుష్‌ సినిమా వివాదం ముగిసినట్టేనా..? | Dhanush and Gautam Menon Movie Issues Cleared | Sakshi
Sakshi News home page

Nov 24 2018 1:16 PM | Updated on Nov 24 2018 1:16 PM

Dhanush and Gautam Menon Movie Issues Cleared - Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌, టాప్ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎనై నోకి పాయుం తోటా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు కిందటే పూర్తయినా ఇంత వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడినట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ధనుష్‌, గౌతమ్‌ల  సినిమా వివాదం ముగిసినట్టుగా తెలుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కారం కావటంతో చిత్రయూనిట్ రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే చిత్రయూనిట్‌ రిలీజ్‌ డేట్‌ విషయంలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్‌ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement