శవంతో సరసాలా? | Devi Sri Prasad Movie Audio Launch | Sakshi
Sakshi News home page

శవంతో సరసాలా?

Oct 16 2017 2:16 AM | Updated on Jul 12 2019 4:42 PM

Devi Sri Prasad Movie Audio Launch - Sakshi

బతికున్నవారితో సరదాలు.. సరసాలు సహజం. శవంతో సరసాలేంటి? కొందరు ప్రబుద్ధులంతే. శవమైనా తమ సరదాలు తీర్చుకోవడానికి వెనకాడరు. లీల అనే ఓ సినిమా ఆర్టిస్టు డెడ్‌బాడీని ఓసారి శవాలగదికి తీసుకొస్తారు. అక్కడ పనిచేసే ఒకడు తన ఇద్దరు స్నేహితులను ఆ గదికి తీసుకొచ్చి లీల శవాన్ని చూపిస్తాడు. వారిలో ఒకడు ఆమె శవంతో సరసాలు ఆడదామని మిగిలిన స్నేహితులనూ ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు లీల ఎలా చనిపోయింది? హత్య చేశారా? ఆత్మహత్య చేసుకుందా? ఈ విషయాలతో తెరకెక్కిన చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్‌’.

పూజా రామచంద్రన్, భూపాల్‌ రాజు, ధనరాజ్, మనోజ్‌ నందం ప్రధాన పాత్రల్లో శ్రీకిషోర్‌ దర్శకత్వంలో డి.వెంకటేష్, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్‌ నిర్మించారు. కమ్రాన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను నటుడు శివ బాలాజీ, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు. ‘‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి ధనరాజ్‌ కారణం. ఈ కథ చాలామందికి చెప్పినా నచ్చలేదు. పూజా రామచంద్రన్‌కి నచ్చి, చేశారు’’ అన్నారు శ్రీకిషోర్‌. ‘‘మంచి సినిమా చేయాలనే ప్రయత్నంతో చేసిన చిత్రమిది. అభ్యంతరకర సన్నివేశాలుండవు’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement