డల్లాస్ కన్సర్ట్.. ఆయనకు అంకితం ఇస్తున్నా
‘డల్లాస్ కన్సర్ట్ను నందమూరి హరికృష్ణ గారికి అంకితం ఇస్తున్నానంటూ’ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన డీఎస్పీ... ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. తారక్ భయ్యా, కల్యాణ్రామ్ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్ కన్సర్ట్ను ఆయనకు అంకితం చేస్తున్నానంటూ’ దేవిశ్రీ ట్వీట్ చేశారు.
కాగా నల్గొండ జిల్లాలో అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుమారులు నందమూరి కల్యాణ్రాం, జూనియర్ ఎన్టీఆర్లు హరికృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు.
Took dis pic a few months bak..Such a loving & warm Human..
We wl miss U sir❤️May ur soul R.I.P🙏🏻💐
Dear @tarak9999 brother and @NANDAMURIKALYAN garu,we r always with U and HE wil always be watching over you
Dedicating DALLAS CONCERT to Sri NANDAMURI HARIKRISHNA garu🙏🏻 pic.twitter.com/L8KyP3KNJN
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018
Jst cant believe d news of Sri HariKrishna Garu..Heart Breaking..
Such a Dear person 2 my Father and Me🙏🏻🙏🏻
And d Sweetest & Most Humble Soul..May God bless his soul & give strength 2 d family of my Dear brother @tarak9999 @NANDAMURIKALYAN garu..
May his soul R.I.P🙏🏻💐❤️— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018
సంబంధిత వార్తలు