మరోసారి రామ్‌కు జతగా..! | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 11:35 AM

Ram Anupama parameswaran - Sakshi

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డీసెంట్‌ హిట్ అందుకున్న ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్‌ సక్సెస్‌ లు సాధించటంలో ఫెయిల్‌ అవుతున్న రామ్‌, నెక్ట్స్‌ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేసుకోవాలని భావిస్తున్నాడు. త్వరలో త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో రామ్‌ కొత్త సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ సరసన హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తొలిసారిగా జతకట్టిన ఈ జోడి మరోసారి హిట్ పెయిర్‌గా ప్రూవ్‌ చేసుకునేందుకు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement