పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే సినిమాకు 'అజ్ఞాతవాసి' అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సరేశ్, అను ఇమ్మాన్యుయేల్, హీరోయిన్లుగా నట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్ వారణాశిలో ప్రారంభమైంది.