రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ | Actress ramya sri new movie O Malli | Sakshi
Sakshi News home page

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ

Feb 28 2015 10:56 PM | Updated on Sep 2 2017 10:05 PM

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం :  రమ్యశ్రీ

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ

నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి

నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా  కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి  చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement