పందిపిల్లకు రాజేం‍ద్ర ప్రసాద్‌ వాయిస్

Actor Rajendra Prasad Voice Over for Piglet In Adhugo - Sakshi

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేక‌త‌లున్నాయి. ఇప్పుడు న‌ట‌కిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జ‌త క‌లిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డ‌బ్బింగ్ చెప్పడం విశేషం. దీవాళి సంద‌ర్భంగా అదుగో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.

పూర్తి ప్రయోగాత్మకంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీల‌క‌పాత్రలో న‌టిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈయ‌న వాయిస్ ఓవ‌ర్ అదుగో చిత్రానికి ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిల‌వ‌నుంది. థియేట‌ర్స్ లో ప్రేక్షకుల‌కు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే విడుద‌లైన అదుగో ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా క‌నిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్ టెక్నాల‌జీని వాడుకున్నారు. తెలుగులో ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాల‌జీ వాడుకోవ‌డం ఇదే తొలిసారి.

అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో న‌టిస్తుండ‌గా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.  ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top