కాబూల్‌పై విరుచుకుపడ్డ ఉగ్రమూకలు | Two Suicide Bomb Attacks In Kabul Death Toll Including Journalists | Sakshi
Sakshi News home page

Apr 30 2018 4:32 PM | Updated on Nov 6 2018 8:35 PM

Two Suicide Bomb Attacks In Kabul Death Toll Including Journalists - Sakshi

రెండో దాడి అనంతరం కాబూల్‌లో నెలకొన్న భయానక వాతావరణం

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌పై ఉగ్రమూకలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో  40 మంది మృతి చెందగా, 49 మంది గాయపడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఆరుగురు జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు. తొలుత ఉదయం 8 గంటల ప్రాంతంలో అఫ్ఘాన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రధాన కార్యలయం సమీపంలో మోటర్‌ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే ఆ సమయంలో వారిలో ఒకరిగా కలిసిపోయిన మరో తీవ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి దాడి జరిగిన కొద్ది సేపటికే రెండో దాడి చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ రెండు ఘటనల్లో పలువురు జర్నలిస్టులతో సహా 25 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎఫ్‌పీకి చెందిన ప్రముఖ ఫొటోగాఫర్‌ షా మారై కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల క్రితం ఓటరు నమోదు కేంద్రం లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 30 మంది పౌరులు మరణించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement