ఆమే కావాలంటున్నారు | Two people die in protests after South Korean judges decision to remove park guen hi | Sakshi
Sakshi News home page

ఆమే కావాలంటున్నారు

Mar 10 2017 11:27 AM | Updated on Aug 25 2018 6:06 PM

ఆమే కావాలంటున్నారు - Sakshi

ఆమే కావాలంటున్నారు

దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌ హే(65)ను ఆఫీసు నుంచి తొలగిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు జరగుతున్నాయి.

దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌ హే(65)ను ఆఫీసు నుంచి తొలగిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు జరగుతున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన పార్క్‌ అభిమానులు ఆమెనే అధ్యక్షురాలిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు అభిమానులకు మధ్య అక్కడక్కడా చోటు చేసుకున్న గొడవల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, శాంసంగ్‌ హెడ్‌తో చేతులు కలిపి పార్క్‌ అవినీతికి పాల్పడినట్లు కోర్టులో నిరూపితమైంది. దీంతో ఆమెను ఆఫీస్‌ నుంచి తొలగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement