పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి | Three killed, one injured in prison breakout in restive Jolo | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి

Jul 16 2017 5:17 PM | Updated on Sep 5 2017 4:10 PM

పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

మనీల(ఫిలిప్పైన్స్‌):
ఫిలిప్పైన్స్‌లోని రెస్టివ్ జోలో ఐలాండ్‌లో ఓ జైలు నుంచి 14 మంది ఖైదీలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఖైదీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఐలాండ్‌ను సందర్శించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. గత జనవరిలో బంగసామోరో ఇస్లామిక్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 160 మంది మిందానౌ ఐలాండ్‌లోని జైలు నుంచి పరారైన సంగతి తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement