లిబియా నుంచి శరణార్ధులతో వస్తున్న పడవ మద్యధరా సముద్రంలో మునిగిపోవటంతో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
బయలుదేరిన కొద్దిసేపటికే అధిక బరువు కారణంగా పడవలోకి నీరు చేరి మునిగిపోయింది. సముద్రంలో తనకు దొరికిన ఖాళీ క్యాన్ సాయంతో ఓ వ్యక్తి బతికి బట్టకట్టగలిగాడు. ఈయూ నేతృత్వంలో మద్యధరా సముద్రంలో విన్యాసాలు చేస్తున్న స్పానిష్ మిలటరీ ఓడ సిబ్బంది గాంబియా వాసిని గుర్తించి ఇటలీలోని లంపెడుసా దీవికి సురక్షితంగా చేర్చారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లిబియా తీరం నుంచి పడవల్లో బయలుదేరిన దాదాపు 590 శరణార్ధులు కనిపించకుండాపోవటం లేదా చనిపోవటం జరిగిందని...తాజా ఘటనతో ఇది మరింత పెరిగిందని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు.