సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే | Russia is the most unequal major country in the world: Study | Sakshi
Sakshi News home page

సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే

Sep 4 2016 9:51 PM | Updated on Sep 4 2017 12:18 PM

సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే

సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే

ప్రపంచ దేశాల్లో రష్యా తర్వాత అసమానత్వం ఎక్కువగా ఉన్న దేశం భారతేనట.

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో రష్యా తర్వాత అసమానత్వం ఎక్కువగా ఉన్న దేశం భారతేనట. 54 శాతం సంపద మిలియనీర్ల (10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ ఆస్తిపరులు) దగ్గరే ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 5,600 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోని మొదటి పది సంపన్న దేశాల్లో భారత్‌ చోటు దక్కించుకుంది. అయినా, సగటు భారతీయుడు మాత్రం పేదవాడేనని ఈ అధ్యయనం నిర్వహించిన ‘న్యూ వరల్డ్‌ వెల్త్‌’ అనే పరిశోధన సంస్థ పేర్కొంది.

ఇక ప్రపంచంలో అత్యధికంగా అసమానతలు కలిగిన దేశం రష్యా అని ఈ నివేదిక తెలిపింది. ఇక్కడ 62 శాతం సంపద మిలియనీర్ల చేతుల్లోనే ఉందట. దేశ సంపదలో 50 శాతం మొత్తం మిలియనీర్ల చేతుల్లోనే ఉంటే ఇక అక్కడ అర్థవంతమైన మధ్య తరగతికి అవకాశాలు తక్కువేనని నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement