
'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం'
‘స్కూళ్లపై దాడిచేస్తాం. విద్యావ్యవస్థలోని 6.60లక్షల మందిని చంపేస్తాం’ అని పోలీసులకు వచ్చిన బెదిరింపుతో
లాస్ఏంజిలిస్: ‘స్కూళ్లపై దాడిచేస్తాం. విద్యావ్యవస్థలోని 6.60లక్షల మందిని చంపేస్తాం’ అని పోలీసులకు వచ్చిన బెదిరింపుతో అమెరికాలోని లాస్ ఏంజిలస్లో పాఠశాలలను మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ బెదిరింపు వచ్చిందని, విద్యార్థులకు ముప్పు వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 2న శాన్ బెర్నార్డినోలో పాక్ జాతీయులైన దంపతులు క్రిస్మస్ పార్టీపై దాడి చేసి 14 మందిని చంపడం తెలిసిందే. తాజా బెదిరింపుతో మొత్తం నగరం అప్రమత్తమైంది.