సొరంగం ధ్వంసం.. పాలస్తీనాకు ఇజ్రాయెల్‌ షాక్‌ | Israel Destroys Tunnel From Gaza | Sakshi
Sakshi News home page

సొరంగం ధ్వంసం.. పాలస్తీనాకు ఇజ్రాయెల్‌ షాక్‌

Jan 14 2018 1:19 PM | Updated on Jan 14 2018 1:19 PM

Israel Destroys Tunnel From Gaza - Sakshi

జెరూసలెం : పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్‌ కాంక్రియస్‌ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ హమాస్‌లో పాలస్తీనియన్‌ ఇస్లామిస్ట్‌ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని, దాని సాయంతోనే స్మగ్లింగ్‌ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారని అన్నారు.

గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటినీ కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్‌ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్టు వరకు ఉందని తెలిపారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే, ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగతున్నట్లు వెల్లడించారు. గ్యాస్‌పైప్‌ లైన్‌ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు వివరించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందే వారు వైమానిక దాడులు జరపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement