25 మంది సైనికులను చంపి వీడియో తీశారు | IS video shows troops' deaths in Syria archaeological site | Sakshi
Sakshi News home page

25 మంది సైనికులను చంపి వీడియో తీశారు

Jul 5 2015 6:12 PM | Updated on Sep 3 2017 4:57 AM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు.

బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. ఐఎస్ ఉగ్రవాదులు 25 మంది సిరియా సైనికులను కాల్చిచంపి.. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టారు. సిరియాలోని పల్మీరా అనే పట్టణంలో ఈ దారుణం జరిగింది.

ఐఎస్ ఉగ్రవాదులు సైనికులను ట్రక్కుల్లో తీసుకుని వచ్చి వరుసగా నిలబెట్టారు. వందలాదిమంది చూస్తుండగా వారిని కాల్చిచంపారు. మే 27న ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. పల్మీరా పట్టణాన్ని ఉగ్రవాదుల తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సైనికులు, ఉద్యోగులను చంపినట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement