న్యూజిలాండ్లో భారతీయ విద్యార్థి దుర్మరణం | Indian student rescued from New Zealand lake dies | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్లో భారతీయ విద్యార్థి దుర్మరణం

Mar 12 2014 5:17 PM | Updated on Sep 2 2017 4:38 AM

న్యూజిలాండ్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మరణించాడు. సిద్ధాంత్ శర్మ అనే 21 విద్యార్థి మంగళవారం మరో ముగ్గురితో కలసి పడవలో ఓ సరస్సులో విహారానికి వెళ్లాడు.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మరణించాడు. సిద్ధాంత్ శర్మ అనే 21 విద్యార్థి మంగళవారం మరో ముగ్గురితో కలసి పడవలో ఓ సరస్సులో విహారానికి వెళ్లాడు. ఈత కొట్టేందుకు సరస్సులో దూకిన అతను సురక్షితంగా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఓ విదేశీ టూరిస్ట్ సరస్సులోకి దూకి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న శర్మను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం హామిల్టన్కు తరలించినా ఫలితం దక్కలేదు. బుధవారం అతను మరణించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement