చైనా సరిహద్దుల్లో పెరిగిన దళాలు

India increases troops along China border in Arunachal - Sakshi

కిబిథు (అరుణాచల్‌ ప్రదేశ్‌): చైనాతో ఏర్పడిన డోక్లాం వివాదం తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌–టిబెట్‌ సరిహద్దుల్లో భారత్‌ మరింత ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించింది. దిబాంగ్, డౌ–డెలాయ్‌ పర్వత ప్రాంతాలు, లోహిత్‌ లోయలో గస్తీని పెంచింది. సరిహద్దులో చైనా కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు మిలిటరీ అధికారులు చెప్పారు.

టిబెట్‌ సరిహద్దుల్లో రెక్కీ నిర్వహించేందుకు హెలికాప్టర్లను ఆర్మీ వాడుతోంది. ‘డోక్లాం వివాదం తర్వాత చైనా సరిహద్దులో మా కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కిబిథు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్మీ అధికారి చెప్పారు. సైనికులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం 15 నుంచి 30 రోజులపాటు వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top