నలుగురు పోలీసులను కాల్చి చంపారు | Four policemen killed by suspected Taliban militants in Pak | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసులను కాల్చి చంపారు

Jan 29 2016 8:17 AM | Updated on Sep 3 2017 4:34 PM

పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు.

కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు. బాలోచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బైక్లపై వచ్చి అనూహ్యంగా ఓ పోలీసు మొబైల్ వ్యాన్పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.

దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తూ తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ మీడియాకు ఈమెయిల్ విడుదల చేసింది. బాలోచిస్తాన్ ప్రావిన్స్లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఇదే చోట ఆత్మాహుతి దాడి జరపగా ముగ్గురు సామాన్యులతోపాటు 12మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement