breaking news
Four policemen
-
నలుగురు పోలీసులను కాల్చి చంపారు
కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు. బాలోచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బైక్లపై వచ్చి అనూహ్యంగా ఓ పోలీసు మొబైల్ వ్యాన్పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తూ తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ మీడియాకు ఈమెయిల్ విడుదల చేసింది. బాలోచిస్తాన్ ప్రావిన్స్లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఇదే చోట ఆత్మాహుతి దాడి జరపగా ముగ్గురు సామాన్యులతోపాటు 12మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు -
నలుగురు పోలీసులను చంపేశారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బాలోచిస్తాన్ ప్రాంతంలో నలుగురు పోలీసులను చంపేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో మోటార్ సైకిళ్లపై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. క్వెట్టాలోని పస్తునాబాద్లో ఈ దారుణం చోటుచేసుకుంది.