మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా | Donald Trump To Skip Correspondents' Dinner, A First In 36 Years | Sakshi
Sakshi News home page

మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా

Feb 27 2017 1:31 AM | Updated on Aug 25 2018 7:50 PM

మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా - Sakshi

మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా

మీడియాపై తరచూ నోరుపారేసు కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జర్నలిస్టులపై తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు.

హాజరు కావడంలేదని ట్విటర్‌లో వెల్లడించిన అధ్యక్షుడు
వాషింగ్టన్ : మీడియాపై తరచూ నోరుపారేసు కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జర్నలిస్టులపై తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌లకోసం ప్రతి ఏటా వైట్‌హౌస్‌ కరస్పాండెట్స్‌ అసోసి యేషన్  (డబ్ల్యూహెచ్‌సీఏ) నిర్వహించే విందు కు తాను హాజరుకావడంలేదని చెప్పారు.

దశాబ్దాల తర్వాత ఈ విందుకు డుమ్మా కొట్టిన అధ్యక్షుడు ట్రంపే కావడ గమనార్హం. ‘‘వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్ల విందుకు నేను హాజరుకావడంలేదు. అందరికీ శుభాకాంక్షలు, విందు బాగా జరగాలని కోరుకుంటు న్నా’’ అని ట్విటర్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌ ఫండ్‌ కోసం ప్రతి ఏటా ఈ విందును నిర్వహిస్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరవుతారు. 1920లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విందు ఏర్పాటు చేశారు. 1972లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్ ఈ విందుకు హాజరు కాలేదు. నిక్సన్  తర్వాత ట్రంప్‌ ఈ విందుకు హాజరుకావడంలేదు. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్  కూడా విందుకు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అంతకుముందు ఆయనపై హత్యాయత్నం జరగడంతో దాని నుంచి కోలుకునే క్రమంలో విందులో పాల్గొనలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement