ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ.. | Brussels Airport Reopens With Three Flights, Tighter Security | Sakshi
Sakshi News home page

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

Apr 3 2016 1:24 PM | Updated on Sep 3 2017 9:08 PM

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

దాదాపు పది రోజుల అనంతరం తిరిగి బ్రస్సెల్స్ విమానాశ్రయం తెరుచుకుంది.

బ్రస్సెల్స్: దాదాపు పది రోజుల అనంతరం తిరిగి బ్రస్సెల్స్ విమానాశ్రయం తెరుచుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుసగా రెండు శక్తిమంతమైన బాంబులు పేల్చిన అనంతరం తాత్కాలికంగా మూతవేసిన ఈ విమానాశ్రయాన్ని బెల్జియం అధికారులు ఆదివారం పదిగంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభించారు. గతంలో లేనంత భద్రతను ఈ విమానాశ్రయానికి కల్పించారు.

ప్రస్తుతానికి మూడు విమానాలతో సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. గత నెల మార్చి 22న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయాన్ని ప్రారంభించినా దాడి సన్ని వేశాలు తమ కళ్లముందే కదలుతుండటంతో తక్కువమందే తొలిరోజు విమానాశ్రయానికి వస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement