న్యూజిలాండ్ పార్లమెంట్‌కు ముగ్గురు భారతీయులు | 3 Indian-origin leaders elected to New Zealand’s Parliament | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ పార్లమెంట్‌కు ముగ్గురు భారతీయులు

Sep 23 2014 3:34 AM | Updated on Sep 2 2017 1:48 PM

భారత సంతతికి చెందిన ముగ్గురు నేతలు న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వీరిలో ఓ మహిళ ఉన్నారు.

మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన ముగ్గురు నేతలు న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వీరిలో ఓ మహిళ  ఉన్నారు. కన్వల్జీత్‌సింగ్ భక్షి, డాక్టర్ పరంజీత్ పర్మర్, మహేష్ బింద్రా 121 మంది సభ్యుల పార్లమెంటుకు ఎన్నికైనట్లు న్యూజిలాండ్ హెరాల్డ్  పత్రిక పేర్కొంది. ఢిల్లీలో జన్మించిన భక్షి, పుణెలో డిగ్రీ చదివిన పర్మర్ అధికార నేషనల్ పార్టీ తరఫున ఎన్నిక కాగా, ముంబైలో జన్మించిన బింద్రా న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement