బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి | 24 killed in coal mine fire in China | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి

Nov 26 2014 9:24 AM | Updated on Sep 2 2017 5:10 PM

ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

బిజీంగ్: ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మందికిపైగా మరణించారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని వెల్లడించారు. ఈ కంపెనీలో దాదాపు 5000 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement