
'ఎన్నికలను ఎదుర్కొనే సత్తా టీడీపీకు లేదు'
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ... దోచుకో, దాచుకోమన్న రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎదుర్కునే సత్తా టీడీపీకి లేదని కోలగట్ల ఎద్దేవా చేశారు. న్యాయపరమైన ఇబ్బందులను తొలగించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు.