చర్లపల్లి జైల్లో ఖైదీలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: చర్లపల్లి జైల్లో ఖైదీలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంలో ఓ ఖైదీ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.