ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి | Two killed in Road accident at Hayathnagar mandal Pedda Amberpet | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి

Jun 18 2014 8:19 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి - Sakshi

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి

హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది.

హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది. ఆ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అలాగే మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ మండలం విటాయ్పల్లి గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు డా.శరత్మోహన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శరత్మోహన్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement