కొనసాగుతున్న బదిలీలపర్వం | Tranfers are continuing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న బదిలీలపర్వం

Jun 1 2017 3:53 AM | Updated on Sep 5 2017 12:28 PM

మియాపూర్‌ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది.

మొత్తం 72 మంది సబ్‌ రిజిస్ట్రార్లు, జాయింట్‌ రిజిస్ట్రార్ల బదిలీ
 
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రెవెన్యూ శాఖ బుధవారం 26 మంది సబ్‌ రిజిస్ట్రార్లు, జాయింట్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. అదే వరుసలో మరో 46 మందిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల అధికారులను ఇతర జిల్లాలకు, ఇంతకాలం నాన్‌ ఫోకల్‌ ప్రాంతాల్లో పని చేసిన వారిని హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (రిజిస్ట్రేషన్ల) శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 72 చోట్ల అధికారులను మార్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement