'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం' | Sakshi
Sakshi News home page

'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం'

Published Thu, Mar 10 2016 1:12 PM

'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం' - Sakshi

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసినా ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, చిన్నారెడ్డిలు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీపై ప్రస్తావనే చేయలేదన్నారు.

వృద్ధిరేటు విషయంలో ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే దాని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వామని వారు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement