
నల్లధనం వెలికి తీస్తున్నారా.. తరలిస్తున్నారా ?
ఎన్నికల ముందు దేశ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెలికి తీస్తున్నారా, లేక దేశం నుంచి బయటకు తరలిస్తున్నారా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
విద్యుత్ ప్లాంట్ పరికరాల కొనుగోలులో ఆదానీ గ్రూప్ కంపెనీలు విదేశీ దిగుమతులపై విలువకు మించి అదనపు విలువను చెల్లించాయి. ఆ అదనపు మొత్తాలను నల్లధనంగా మార్చినట్లు ఈపీడబ్ల్యూ నివేదిక స్పష్టం చేస్తోంది. ’’అని పేర్కొన్నారు.