విద్యుత్ పొదుపుపై సర్వే | Survey on Power Savings | Sakshi
Sakshi News home page

విద్యుత్ పొదుపుపై సర్వే

Sep 4 2016 8:45 PM | Updated on Sep 18 2018 8:37 PM

రాష్ట్రంలో విద్యుత్ పొదుపుపై మలివిడత థర్డ్‌పార్టీ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ పొదుపుపై మలివిడత థర్డ్‌పార్టీ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఇప్పటికే తొలిదశలో నాలుగు జిల్లాల్లో సర్వే నిర్వహించామని, మరో తొమ్మిది జిల్లాల్లో త్వరలో చేపడతామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటి ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశామని, ఇంధనపొదుపు సామర్థ్యం ఉన్న స్టార్ రేటెడ్ ఫ్యాన్లు, విద్యుత్ ఉపకరణాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటి ఫలితాలపై విశ్లేషించేందుకు ఈ నెల 6వ తేదీన ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement