ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

Published Tue, Feb 28 2017 2:44 PM

ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

హైదరాబాద్ : అమెరికాలో జాతి అహంకార కాల్పుల్లో మృతి చెందిన కూచిభోట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాసం నుంచి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది.

శ్రీనివాస్కు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికాలో జాతి అహంకారం నశించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. శ్రీనివాస్ భార్య, తల్లిదండ్రులు వర్షిణి, మధుసూదన్ లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆయన అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సంతాపం తెలిపారు.

అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి...
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement