సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సస్పెన్షన్లో ఉన్న ఆమెకు ప్రభుత్వ రంగ సంస్థ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆమె పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.