♦ గ్రేటర్ ఎన్నికల్లో ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్
♦ తొలిసారి 150 డివిజన్లలో పోటీ
♦ అభివృద్ధి కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం
♦ గతంలో పాలించిన పార్టీలు చేసిందేమీ లేదంటూ విమర్శనాస్త్రాలు
♦ బల్దియాపై తమ జెండా ఎగురుతుందని ధీమా
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరమే నినాదంగా తొలిసారి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగిన అధికార టీఆర్ఎస్.. మేయర్ పీఠంపై జెండా ఎగ రేసేందుకు ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆరేళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క డివిజన్లోనూ పోటీ చేయని గులాబీ పార్టీ ఈసారి మొత్తం 150 డివిజన్లలో తలపడుతోంది. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుని ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో పార్టీ శ్రేణులను మోహరించింది. గులాబీ నేతలు, కార్యకర్తలంతా మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
విసృ్తతంగా ప్రచారం..
రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. రాజధాని నగరంలోనూ తమ పాలనే ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఒకటికి రెండుసార్లు మందలించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో ప్రచారం చేశారు. జంట నగరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలకు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి హోంవర్క్గా ప్లాన్ చేసింది. అభ్యర్థుల ఖరారు తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని రంగంలోకి దించి, ఏ ఒక్క బూత్ను వదలకుండా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు, నగరానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న అంశంపై ఎక్కువగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.
విపక్షాలపై వినూత్న దాడి
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. విమర్శనాస్త్రాలతో ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోనీయకుండా చేసింది. ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్లో పాలన చేసింది కాంగ్రెస్, టీడీపీలే అని, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎండగట్టింది. టీడీపీతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న బీజేపీపై మరో రకంగా విరుచుకుపడింది. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపిం చింది. నగరంలో నివసిస్తున్న వారంతా ఇక్కడి వారేనన్న ధీమా కల్పించేలా ప్రచారం చే సింది. ఎన్నికల ప్రచార బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. 9 రోజుల పాటు 120 డివిజన్లలో ప్రచారం చేసిన ఆయన.. 135 చోట్ల ప్రసంగించారు. కుల సంఘాలు, న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. తమతోనే నగరాభివృద్ధి సాధ్యమంటూ ముమ్మరంగా ప్రచారం చేసిన అధికార పార్టీ.. బల్దియాపై తమ జెండా ఎగరడం ఖాయమన్న నమ్మకంతో ఉంది.
విశ్వనగరమే నినాదంగా
Published Tue, Feb 2 2016 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement