టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేందర్‌ రెడ్డి | Rajender reddy joins in TRS party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేందర్‌ రెడ్డి

Feb 16 2016 8:22 PM | Updated on Aug 15 2018 9:30 PM

టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేందర్‌ రెడ్డి - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేందర్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి
  కేసీఆర్‌ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
  నెలాఖరులో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ
సభా వేదికగా అధికారకంగా టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యేలు


హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో అధికారకంగా చేరనున్నారు.

ఈ నేపథ్యంలో నెలాఖరులో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, నారాయణఖేడ్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్‌.. వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జరిగే పురపాలక ఎన్నికలపై దృష్టి సారిస్తూ వడిగా అడుగులు వేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement