హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి | President of India to visit Rashtrapati Nilayam, Secunderabad for Southern Sojourn | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి

Dec 21 2016 3:01 PM | Updated on Sep 4 2017 11:17 PM

హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈనెల 22 నుంచి 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 23న ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో ఎండీఎస్‌, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొంటారు. అదేరోజు ఎఫ్‌టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొంటారు.

డిసెంబర్‌ 24న  హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్‌ మలాని కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ లను రాష్ట్రపతి ప్రారంభించన్నారు. 25న బెంగళూరులో పర్యటించనున్న ఆయన.. తరువాతి రోజు మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 29న తిరువనంతపురంలో 77వ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement