రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శనివారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు వీడ్కోలు పలికారు.
నగరంలో నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేసీఆర్ కూడా పాల్గొన్నారు.